జనసేన నేతృత్వంలో జనవరి 12వ తేదీన యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
యువతకు భరోసా ఇవ్వడానికి యువశక్తి జరగనుందని తెలుస్తోంది.వారాహి విషయంలో కొందరు ప్రెస్ మీట్ పెట్టి కంగారు పడిపోతున్నారని నాదెండ్ల విమర్శించారు.
తాము నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని వెల్లడించారు.రాష్ట్రం కలిసుంటే బాగుంటుందని ప్రజలను అయోమయ స్థితిలోకి నెట్టుతున్నారని తెలిపారు.
జగనన్న కాలనీ ఒక పెద్ద కుంభకోణమని ఆయన ఆరోపించారు.