ఏ ముఖ్యమంత్రైనా.తన మంత్రి వర్గం తన మాట వినాలని, తన కనుసన్నల్లో పనిచేయాలని భావిస్తారు.
గతంలో చంద్రబాబు అయినా.అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డి అయినా.
తమకు అనుకూలంగా ఉన్నవారినే మంత్రులుగా నియమించుకున్నారు.వారు కూడా అలానే సీఎంలకు అనుకూలంగా వ్యవహరించేవారు.
సీఎం ఏం చెబితే అదే చెప్పేవారు.అయితే, ఇప్పుడు సీఎం జగన్ కేబినెట్లో కొందరు మంత్రులు సీఎం కే ఎసరు పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
దీనిపై సీఎం జగన్ గుస్సాగా ఉన్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని జగన్ ప్రస్థావించినట్టు తెలుస్తోంది.
కొందరు మంత్రులు ఆయన వద్ద వినయం నటిస్తూనే.కొన్ని రహస్యాలను ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఉండే వ్యక్తులుకు , మీడియాలకు చేరవేస్తున్నారని సాక్షాత్తూ.
సీఎం జగన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.దీంతో అసలు ఎవరిని నమ్మాలి ? ఎవరిని నమ్మకూడదు ? అనే విషయంలో జగన్ కళ్లు తెరిచే సరికి ఏడాదిన్నర పూర్తయిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
వాస్తవానికి జగన్ కేబినెట్లో ఉన్నవారిలో కొందరు పలు పార్టీలు మారి వచ్చిన వారు ఉన్నారు.గతంలో టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించిన వారు కూడా ఉన్నారు.అయితే, ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను వీరే బయటకు లీక్ చేస్తున్నారా ? ప్రభుత్వం నేరుగా ప్రజలకు ప్రకటన రూపంలోనో.జీవో రూపంలోనో చెప్పేలోపే.
ప్రత్యర్థులకు చేరవేస్తున్నారా ? అంటే.జగన్ వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది.
సొంత పార్టీ నాయకులు, వైసీపీలో ఆది నుంచి ఉన్నవారి నుంచి ఈ తరహా ఇబ్బంది లేదని, కేవలం గత ఎన్నికలకు ముందు కొందరు పార్టీలోకి వచ్చి .మంత్రి పదవులు దక్కించుకున్న వారి వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.మరి వీరి విషయంలో జగన్ చర్యలకు దిగుతారా? చూడాలి.ప్రస్తుతానికైతే.
హెచ్చరించి వదిలేయడం గమనార్హం.మరి ఏంజరుగుతుందో చూడాలి.