వైసీపీ అధ్యక్షుడు జగన్ కు జైలు భయం నిద్రపొనీయకుండా ఢిల్లి పరుగులు తీయిస్తోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.సిబి ఐ కేసులుతో ఏ క్షణం ఏమైపోతుందని భయం తో బిక్కు బిక్కు మంటూ సాగుతున్నారు .
తనతో చేతులు కలిపినా బడాబాబుల పని ఈడీ కేసులవలయంతో ఈసరికే పలుమార్లు జప్తులయ్యాయి .ఆ భయంతోనే జగన్ ప్రధాని కాళ్లపై పడేందుకు మార్గాలు వెతుకుతున్నారని మంత్రి ఉమా వ్యంగ్యంగా విమర్శలు చేసారు .జగన్ కలిసిరానందునే పోలవరం ఆలస్యమైందని చెప్పారు .పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆరు నూరయిన చేసి తీరుతాము.అందుకే ఓపెన్ టెండర్ ఇవ్వడం జరిగిందన్నారు.ఉమా ఇలా జగన్ పై ధ్వజం ఎత్తడానికి కారణం జగన్ ప్రధానిని కలుసుకుని రాష్ట్రం కోసం చర్చించడమే .అయితే జగన్ మోడితో చర్చలు ఇలా సాగాయి.ఎన్నికల్లో బాబు ఇచ్చిన ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలని ప్రధాని మోడీని కోరినట్లు వైసీపీ నేత జగన్ ఢిల్లి మీడియాతో చెప్పారు .ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి నిధులు, రైల్వే జోన్, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు జగన్ చెప్పారు.మోడీ కూడా జగన్ చెబుతుంటే ఆసక్తిగా విన్నారు అని వై సి పి ఎంపిలూ తెలిపారు.