ఏపీలో వైసీపీ పరిస్థితి చూస్తే పెత్తనం మొత్తం జగన్ ది మాత్రమే అన్నట్టు కనిపిస్తుంది.ఎందుకంటే ఆయన ఇంటి సభ్యులు పార్టీలో పెద్దగా లేరు.
కేవలం ఆయన మాత్రమే అన్నింటినీ చూసుకుంటున్నారు.అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా అన్నీ తానై చూసుకుంటున్నారు.
కానీ ఒక్క వ్యక్తి రెండు పడవలమీద ప్రయాణం చేయడమంటే అంత ఈజీ కాదు కదా.ఇదే ఇప్పుడు జగన్ను ఇరకాటంలో పడేస్తోంది.
పార్టీ పరంగా ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతోంది.పార్టీలో చాలామంది నేతలకు అసలు జగన్ అపాయింట్ మెంట్ దొరకడం చాలా కష్టతరం అయిపోతోంది.
వందల మంది నేతలు ఉన్న కారణంగా మామూలుగానే వర్గ విభేదాలు వస్తాయి.తమకు అన్యాయం జరుగుతోందని చాలామంది మొర పెట్టుకుంటున్నారు.జిల్లాలో ఇన్ చార్జి మంత్రులు తమను పట్టించుకోవట్లేదని చాలామంది ఎమ్మెల్యేలు ఏకంగా ఓపెన్ అయిపోతున్నారు.ఇదే బాధను జగన్కు వివరించాలనుకుంటే ఆయన అపాయింట్ మెంట్ దొరక్క చివరకు వర్గ విభేదాలు వస్తున్నాయన్న మాట.
ఇక ఎంపీల విషయం కూడా ఇలాగే ఉంది.కేవలం పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజుల ముందు మాత్రమే జగన్ తమతో మీటింగ్ పెట్టి మిగతా సమయంలో పట్టించుకోవట్లేదని వాపోతున్నారంట.
అయితే ఈ విబేదాలు కాస్తా ఆయా జిల్లాల్లో పార్టీని ఇబ్బందుల్లో పడేస్తోంది.అదే ప్రతిపక్షాలకు ప్లస్ అవుతోంది.ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు వైసీపీలో పరిస్థితులు ఉన్నాయి.ఆధిపత్యం కోసం అందరూ పాకులాడటంతో చివరకు విబేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.అయితే జగన్ మాత్రం వీటిని పట్టించుకునేందుకు సమయం ఇవ్వట్లేదు.ఈ వర్గ విబేధాలను జగన్ పరిష్కరించకుంటే చివరకు పార్టీ పరంగా రాబోయే రోజుల్లో చంద్రబాబుకు వస్తున్న పరిస్థితే వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి జగన్ ఇప్పటికైనా వీరిని పట్టించుకుంటారో లేదో చూడాలి.
.