మూడు రాజధానులు ఏ ఒక్కరు అడ్డుకోలేరు

ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం అంటూ మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘటించాడు.ఖచ్చితంగా సీఎం జగన్‌ అనుకున్నట్లుగా మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతాడు అని, దాన్ని ఏ ఒక్కరు అడ్డుకోలేరు అంటూ తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పడం జరిగింది.

 Jagan Vijay Sai Reddy Three Capitals-TeluguStop.com

రాజధానుల విషయంలో కొందరు అడ్డు పడే ప్రయత్నం చేస్తున్నారు.ఎవరేం చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఖచ్చితంగా రాజధానిని వైజాగ్‌లో ఏర్పాటు చేయడం తద్యం అన్నాడు.

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉన్న విషయం తెల్సిందే.ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో పాస్‌ చేసుకున్న ప్రభుత్వం మండలిలో మాత్రం చేసుకోలేక పోయింది.

మండలి సెలక్షన్‌ కమిటీ ముందు ఈ బిల్లు ఉంది.మండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్న కారణంగా మొత్తానికి మండలి వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube