ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం అంటూ మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘటించాడు.ఖచ్చితంగా సీఎం జగన్ అనుకున్నట్లుగా మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతాడు అని, దాన్ని ఏ ఒక్కరు అడ్డుకోలేరు అంటూ తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పడం జరిగింది.
రాజధానుల విషయంలో కొందరు అడ్డు పడే ప్రయత్నం చేస్తున్నారు.ఎవరేం చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఖచ్చితంగా రాజధానిని వైజాగ్లో ఏర్పాటు చేయడం తద్యం అన్నాడు.
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉన్న విషయం తెల్సిందే.ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసుకున్న ప్రభుత్వం మండలిలో మాత్రం చేసుకోలేక పోయింది.
మండలి సెలక్షన్ కమిటీ ముందు ఈ బిల్లు ఉంది.మండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుంటున్న కారణంగా మొత్తానికి మండలి వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.