ఈ నెల 23వ తారీకు నుండి 25 వ తారీకు వరకు సీఎం జగన్ మూడు రోజుల పాటు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని.ఇంకా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారట.క్రిస్మస్ పండుగ సందర్భంగా 25 వ తారీఖున పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం.
చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించడం జరుగుతుందట.
ఇదిలా ఉంటే 24వ తారీఖున తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు కుటుంబ సమేతంగా నిర్వహించనున్నారు.
అనంతరం సొంత నియోజకవర్గం పులివెందులలో పలు ప్రారంభోత్సవాలలో… జగన్ పాల్గొననున్నారట.దీంతో సీఎం జగన్ మూడు రోజుల పర్యటనకు సంబంధించి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందట.23 వ తారీకు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి కడప చేరనున్నారు.ఆ తర్వాత జిల్లాల్లో మూడు రోజుల పర్యటన ముగించుకుని 25వ తారీకు కడప నుండి తిరిగి గన్నవరం చేరుకోనున్నారట.