కడప జిల్లాలో మూడు రోజుల పర్యటించనున్న జగన్..!!

ఈ నెల 23వ తారీకు నుండి 25 వ తారీకు వరకు సీఎం జగన్ మూడు రోజుల పాటు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని.ఇంకా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారట.క్రిస్మస్ పండుగ సందర్భంగా 25 వ తారీఖున పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం.

 Jagan To Tour Kadapa District For Three Days, Ys Jagan, Kadapa , Christmas, Ysr-TeluguStop.com

చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించడం జరుగుతుందట.

ఇదిలా ఉంటే 24వ తారీఖున తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు కుటుంబ సమేతంగా నిర్వహించనున్నారు.

అనంతరం సొంత నియోజకవర్గం పులివెందులలో పలు ప్రారంభోత్సవాలలో… జగన్ పాల్గొననున్నారట.దీంతో సీఎం జగన్ మూడు రోజుల పర్యటనకు సంబంధించి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందట.23 వ తారీకు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి కడప చేరనున్నారు.ఆ తర్వాత జిల్లాల్లో మూడు రోజుల పర్యటన ముగించుకుని 25వ తారీకు కడప నుండి తిరిగి గన్నవరం చేరుకోనున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube