ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయ్యిందో లేదో అప్పుడే ఎన్నో పథకాలను ప్రారంభించడంతో పాటు, పలు పనులు ముందుకు తీసుకు వెళ్తున్నాడు.
ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్దం అయ్యాడు.ఎన్నికల సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామంటూ జగన్ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.
త్వరలో ఆ హామీని అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్తగా వేయబోతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం వాటాను బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.
అలాగే మహిళలకు కూడా మొత్తంగా యాబై శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు.ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలంటూ సీఎం జగన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఔట్ సోర్పింగ్ ఉద్యోగుల కోసం ఒక కార్పోరేషన్ను ఏర్పాటు చేసి దాని ద్వారా జీతాలు ఇవ్వడం చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి ఒక వెబ్ పోర్టల్ను కూడా ప్రారంభించాలని జగన్ నిర్ణయించాడు.