వైసీపీ అధినేత వై ఎస్ జగన్ గురువారం ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి పదమూడు జిల్లాల వైఎస్ అభిమానూలు భారీగా విజయవాడ తరలి వచ్చారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి నుంచి జగన్మోహన్రెడ్డి వరకు ఆ కుటుంబానికి అభిమానులుగా కొనసాగుతున్న వేలాది మంది అభిమానులు వచ్చారు.అయితే వారిలో ఒక్క అభిమాని మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఒకొక్కరు ఒక్కో విధంగా తమ అభిమానాన్ని చాటుతారు.
ఒక అభిమాని నిన్న జగన్ పై ఉన్న అభిమానం తో ఉచిత టీ ని అందించగా, ఒక అభిమాని ఏకంగా ఒంటికి ఫ్యాన్ బిగించుకొని మరి తన అభిమానాన్ని చాటుకున్నాడు.పెద్దాయన్నుంచి జగన్ వరకు నేను అభిమానట.గత ఎన్నికల్లో నూ, పాదయాత్రలోనూ ఇదే తరహాలో బ్యాటరీలు, వైర్ల సాయంతో ఒంటికి ఫ్యాన్ బిగించుకుని వారి వెంటే తిరిగాడట.
ఇప్పుడు జగన్ ప్రమాణ స్వీకారం ఉండడం తో మళ్లీ అలానే ఫ్యాన్ ని ఒంటికి ధరించి మరీర్ వచ్చాడట.ఓపికున్నంత వరకూ ఇలా ఆయన వెనుకే తిరుగుతుంటాను అని తెలిపాడు.