ఆ ఎమ్మెల్యేపై జగన్‌ ఆగ్రహంతో ఉన్నాడా?

శ్రీకాళహస్తిలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో అంతా కూడా ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నాడు.ఆయన బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ పేరుతో నానా రచ్చ చేసి కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణం అయ్యాడు అంటూ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

 Jagan Angry On Srikalahasthi Mla Biyyappu Madhusudhan Reddy, Srikalahasthi, Biyy-TeluguStop.com

ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలు పబ్లిసిటీ కార్యక్రమాల మాదిరిగా ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ సమయంలోనే ఆయన తీరుపై విమర్శలు వచ్చాయి.

కాని అది సేవా కార్యక్రమం అవ్వడంతో ఎవరు కూడా ఆయన్ను తప్పుబట్టలేదు.కాని ఇప్పుడు మొత్తం ఆయన్నే టార్గెట్‌ చేస్తున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.హంగు ఆర్బాటాలతో ఆయన చేసిన సేవా కార్యక్రమం సోషల్‌ మీడియాలో పార్టీ పరువు తీసిందంటూ జగన్‌ ఆగ్రహంతో ఉన్నాడు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులను అదుపు చేయలేక తలకాయ పట్టుకున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి విషయం మరింత రచ్చకు దారి తీస్తుందని జగన్‌ భావిస్తున్నాడట.ఇప్పటికే ఎమ్మెల్యేను ఫోన్‌లో మందలించినట్లుగా చెబుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube