బుల్లితెర మీద నంబర్ వన్ షో గా వెలుగొందుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం కి అనతికాలంలోనే ఎంతో గుర్తింపు వచ్చింది.కామెడీ ప్రధానంగా సాగే ఈ షో కి జడ్జీలుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తున్నారు.
స్కిట్ లో నటులు చేసే కామెడీకి పగలబడి నవ్వడమే ఈ జడ్జీల ప్రధాన విధి.జబర్దస్త్ కి టీఆర్ఫీ రేటింగులు కూడా బాగా వస్తుండడంతో రోజాకు నెలకు సుమారు 20 లక్షల వరకు ముడుతోందట.
అందుకే ఏ ఒక్క షో కి మిస్ అవ్వకుండా రోజా తను షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకుంటూ వస్తోంది.
ఒకపక్క ఎమ్మెల్యేగా, మరోపక్క ఏఐసిసి చైర్మన్ గా రెండు విధులను నిర్వహిస్తోంది.
అయితే ఈ రెండిటి కంటే ఎక్కువగా జబర్దస్త్ షోకే రోజా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో, జగన్ ఆమెను పిలిచి గట్టిగా కాస్ పీకినట్టు తెలుస్తోంది.నీకు కు రెండేళ్ల తర్వాత మంత్రివర్గంలో చోటు ఇద్దామని ఆలోచనలో ఉన్నామని కాబట్టి పార్టీ కార్యక్రమాల గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టి నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటే మంచిదని లేకపోతే ఆ తరువాత ఇబ్బందులుపడతావని జగన్ సున్నితంగా మందలించినట్టు తెలుస్తోంది.
దీంతో జబర్దస్త్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆమె ఆయోమయ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.రాజకీయంగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలంటే ఆదాయం ఇచ్చే జబర్దస్త్ ని వదులుకోవడం ఒక్కటే మార్గమని కొంతమంది సన్నిహితులు సూచించారట.
అదీకాకుండా వైసీపీకి రాజకీయ ప్రత్యర్థిగా మారిన జనసేన పార్టీకి చెందిన నాగబాబుతో కలిసి రోజా నవ్వులు చిందించడం పై కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ షో కి గుడ్ బాయ్ చెప్పే ఆలోచనలో ఉన్నారట.