ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెల్సిందే.ఈ సమావేశాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్పై జగన్ ఒక ప్రకటన చేశాడు.
ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ ఒక జరగకూడని సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్బుతం అంటూ ఈ సందర్బంగా జగన్ అన్నాడు.
కేసీఆర్ గారికి హ్యాట్సాప్ అన్నాడు.తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు.
నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అసెంబ్లీలో స్పందించడంతో మరోసారి దేశ వ్యాప్తంగా ఈ విషయమై చర్చనీయాంశం అవుతుంది.ఏపీ అసెంబ్లీలో తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ గురించి చర్చ జరగడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలంగాణ ప్రభుత్వం చేసిన పనిని ఏపీ అసెంబ్లీ సమర్ధించింది.దిషా వంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఎన్కౌంటర్స్ తప్పవంటూ ఈ సందర్బంగా ఏపీ అసెంబ్లీ ఒక ప్రకటనలో పేర్కొంది.