ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు జరగటం వాటి ఫలితాలు రావడం తెలిసిందే.ఈ తరుణంలో అధికార పార్టీ వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ దిశగా.
విజయాలు సాధించడం జరిగింది.అన్నిటికంటే హైలెట్ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం జరిగింది.
దీంతో నిన్నటి నుండి చంద్రబాబు నాయకత్వంపై.వైసీపీ నాయకులు భారీ స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు.
కాగా ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం జగన్ కుప్పం పేరు చెప్పి చంద్రబాబు పై సెటైర్లు వేశారు.
జగన్ అసెంబ్లీలో ఏమన్నారంటే… పెన్షన్ లకు సంబంధించి చర్చ జరిగిన సమయంలో మహిళా సాధికారికత గురించి జగన్ మాట్లాడుతున్న క్రమంలో.మహిళలకు సంబంధించి చర్చ గనుక చంద్రబాబు వస్తారేమోనని భావించాను.
బిఎసి సమావేశంలో కూడా చాలా సేపు ఎదురు చూసాము.కానీ చంద్రబాబు ఎక్కడా కూడా కనబడలేదు.
ఆలస్యం చేసినా గాని ఆయన రాలేదు.ఆయన ఇక్కడ ఉన్నారో లేదో మరి.మా వాళ్లు మాత్రం చంద్రబాబు అసెంబ్లీలో రాకపోవడానికి గల కారణం కుప్పం ఎఫెక్ట్ అని అంటున్నారు అంటూ జగన్ నిండు అసెంబ్లీ లో చంద్రబాబు పై సెటైర్లు వేశారు.