గత నెల ఫిబ్రవరి మాసం రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో కొన్ని చోట్ల కొంతమంది రేషన్ తీసుకొని పరిస్థితి అప్పట్లో ఏర్పడింది.
కాగా తాజాగా జగన్ సర్కార్ రేషన్ కార్డు దారులకు సరికొత్త గుడ్ న్యూస్ తెలిపింది.మేటర్ లోకి వెళ్తే ఫిబ్రవరి రేషన్ తీసుకొని వారికి మరో అవకాశం కూడా కల్పిస్తూ మార్చి 6 నుంచి 10వ తేదీ వరకు క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానంతో ఫిబ్రవరి మరియు మార్చి రేషన్ ఒకేసారి పొందే అవకాశాన్ని పౌరసరఫరాల శాఖ కల్పించింది.దీంతో మార్చ్ ఆరో తారీకు నుండి పదవ తారీకు వరకు రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో ఒకరోజు గ్రామీణ ప్రాంతాలలో విరామం ఇవ్వగా అర్బన్ ప్రాంతంలో మాత్రం రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది అంటూ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.