భూమి మీద మనిషి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా మహమ్మారి ప్రపంచంలో ఎంటర్ అయ్యాక అనేక మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.అనేక కంపెనీలు మూతపడటంతో చాలా మంది ఉద్యోగస్తులు ఇంటినుండే విధులు నిర్వహిస్తున్నారు.
ఇక విద్యార్థుల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది.
ఆన్ లైన్ లో విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి.
ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది పేదవాళ్ళు స్మార్ట్ ఫోన్ లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఇక గ్రామాల్లో అయితే సరైన సిగ్నల్ లేక ఇంటర్నెట్ సదుపాయం లేక ఆ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి.
ఈ క్రమంలో జగన్ సర్కార్ గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మ ఒడి కింద ల్యాప్టాప్ ల పంపిణీ వంటి విషయాలపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష చేశారు.
.