రోజురోజుకి భారతదేశంలో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతోంది.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలో కరోనా వైరస్ బారిన పడి అనేక మంది మృతి చెందుతున్నారు.అలా మృతి చెందిన వారిని వైద్య సిబ్బంది అంత్యక్రియలు చేపడుతోంది.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అనేక ఫిర్యాదులు అందాయి.ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఇదివరకే కరోనా వైరస్ నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ప్రతి వ్యక్తికి రాష్ట్రంలో రూ.2000 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.తాజాగా రాష్ట్ర సర్కార్ కరోనా తో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏకంగా రూ.15 వేలు చొప్పున ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి తీసుకురావాలని అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.ఇక తాజాగా రాష్ట్రంలో 33000 లపై గా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో 408 మంది ప్రాణాలు విడిచారు.