అసెంబ్లీలో తన గురించి, తన కుటుంబ సభ్యుల గురించి వ్యక్తిగతంగా ప్రస్తావించిన వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి మరీ కన్నీటిపర్యంతమయ్యారు.అసలు ఇప్పటివరకు చంద్రబాబు ఈ విధంగా ఎప్పుడు కన్నీళ్లు కార్చిన ఘటన చూడలేదు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏ విషయంలోనూ మనోధైర్యం కోల్పోరు.ఏ రాజకీయ విమర్శలను అయినా సమర్థవంతంగా తిప్పికొట్టగలరు.
అయితే వ్యక్తిగత విషయాలపై వైసిపి మంత్రులు అవహేళన చేస్తూ మాట్లాడిన ఘటనపై బాబు ఆవేదన చెందుతూ కన్నీళ్లు కార్చారు.ఈ ఘటన ఏపీలో పెద్ద సంచలనంగా మారింది.
నిన్న ఎన్నికల ఫలితాలు టిడిపి ఓటమి వ్యవహారాన్ని వైసీపీ మంత్రులు ప్రస్తావించడం, అంతే స్థాయిలో చంద్రబాబు జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని, జగన్ తల్లి, చెల్లి వ్యవహారాన్ని ప్రస్తావించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దీనిపై జగన్ స్పందించారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరుస్తూ ఎవరు సభలో మాట్లాడలేదని, తన తల్లి చిన్న తల్లి గురించి మాట్లాడారని , గతంలో జరిగిన హత్యలపై విచారణ జరగాలని, తమ సభ్యులు అంటే దాన్ని వేరే రకంగా మార్చి డ్రామా క్రియేట్ చేశారని జగన్ విమర్శించారు.గతంలో తన బాబాయ్ ని ఓడించాలని చూశారని, ఆయనను వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబు మాటలు చూస్తే ఒక్కోసారి బాధ కలిగిస్తుందని, ఆ సమయంలో తాము సభలో లేనని జగన్ చెప్పారు.తాను సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్ష చేశానని, ఆ తరువాత సభలో జరిగిన పరిణామాలను తెలుసుకున్నను అన్నారు.
తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారని, ఆయన ప్రస్టేషన్ లో ఉన్నారన్నారు.
చంద్రబాబు మీద తాము వ్యతిరేకం గా ఉన్నామని ప్రజలు తీర్పు ఇచ్చారు.ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకతను చూశారు.మండలిలో కూడా వారికి ఉన్న బలం పూర్తిగా మారిపోయింది.
వైసిపి బలం పెరిగింది. ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుంది.
ఒకవైపు వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న సందర్భాల్లో ప్రతిపక్షం వచ్చి సూచనలు , సలహాలు ఇవ్వాలి కానీ, అలా జరగడం లేదని చెప్పుకొచ్చారు.