కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్ చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నాడు.ఇప్పటివరకు తన మీద పడ్డ అవినీతి మరకలు తన పాలనలో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అంతే కాదు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే భావన ప్రజల్లో బలంగా తీసుకొచ్చేందుకు జగన్ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు.పదేళ్ల కష్టం, ఎదురుచూపుల తర్వాత ఇంత భారీ మెజార్టీ సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ పక్కా ప్లాన్ తో తన నిర్ణయాలు అమలయ్యేలా చూసుకుంటున్నాడు.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన ప్రసంగం కూడా ఆసక్తికరంగా సాగింది.ఐదేళ్లు చంద్రబాబుది అవినీతి పాలన అంటూ విమర్శలు చేసిన జగన్ వాటికి ఆధారాలతో నిరూపించి టీడీపీని ప్రజల ముందు దోషిగా నిరూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.
తాను అవినీతి లేని పాలన అందిస్తానని, పూర్తిగా ప్రక్షాళన చేస్తానని జగన్ పదే పదే చెబుతున్నాడు.టెండర్లు,కాంట్రాక్టుల జారీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తామని జగన్ స్పష్టంగా చెబుతున్నారు.
అంతే కాదు ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామని, లంచాలు లేకుండా చూస్తామని జగన్ తన ప్రసంగంలో చెప్పారు.తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం లేదా పథకాలు లంచనాలు లేకుండా అందితే ప్రజల్లో సంతృప్తి ఉంటుంది.
ఇది నేరుగా ముఖ్యమంత్రిగా ఉన్న తనకి ఇది బాగా మంచి పేరు తీసుకొస్తుంది అనే భావనలో జగన్ ఉన్నారు.గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, అందుకే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులను సమీక్షించి తక్కువ ధరలకు రీటెండరింగ్ చేస్తామని, ఇలా తమ ప్రభుత్వం రావడం వల్ల ఎంత డబ్బు మిగిలిందో ప్రజలకు చెప్పాలనేది జగన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
గత టీడీపీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని లూటీ చేసిందని తమ పార్టీకి చెందిన, అనుకూలంగా ఉండేవారికి కాంట్రాక్టులు ఇచ్చి వారికి బాగా లబ్ది చేకూర్చారనే విషయాన్ని రుజువు చేయడంతో పాటు ఆ కాంట్రాక్టులు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలవడం ద్వారా టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లు దెబ్బతినడంతో పాటు టీడీపీకి వారి నుంచి ఆర్ధిక సహకారం ఆగిపోతుందని ఇలా రెండు విధాలా నష్టం చేకూర్చవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నాడు.టీడీపీ మీద తాను కక్ష సాగిస్తున్నట్టు ప్రజల్లో ఎటువంటి భావన కలగకుండా పరోక్ష ఇలా దెబ్బకొట్టేందుకు జగన్ ప్లాన్ చేస్తుండడం చూస్తుంటే ఇక తరువాత తరువాత టీడీపీని జగన్ ఏ విధంగా ఇరుకున పెట్టబోతున్నాడో అనే విషయం అర్ధమయిపోతోంది.