తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా హోం క్వారంటైన్ కు వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారు.పార్టీ తరఫున రాజకీయ ప్రకటనలు ఇస్తున్న , పవన్ మాత్రం పెద్దగా యాక్టివ్ గా లేరు.
ప్రస్తుతానికి సినిమాలే లోకం అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు.దీంతో జనసేన వర్గాల్లోనూ గందరగోళం నెలకొంది.
అసలు పవన్ ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు.మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారు అనే ప్రశ్న జనసేన వర్గాల నుంచి వస్తోంది.
ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ప్రజలలోను ప్రభుత్వ తీరుపై ఆగ్రహం ఉంది.
దీన్ని ఉపయోగించుకుని లబ్ది పొందేందుకు టిడిపి ప్రయత్నిస్తుండగా, జనసేన మాత్రం వెనుకబడి పోయింది.అయితే పవన్ ఇంత మౌనంగా ఉండడానికి కారణం కూడా ఉందట.
ప్రస్తుతం బిజెపితో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కు ఆ పార్టీ పైన పెద్దగా ఆశలు లేవు.ఎంతగా కష్టపడినా, ప్రభుత్వంపై విమర్శలు చేసినా , పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదని, బిజెపి ఓటు బ్యాంకు అంతంతమాత్రంగా ఉంది అని, పైగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వ విధానాల పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ఆ ఎఫెక్ట్ తమపైన పడుతుందనేది పవన్ ఆలోచన.
అందుకే 2023 వరకు సైలెంట్ గానే ఉండి, ఆ తర్వాత టిడిపితో పొత్తు పెట్టుకోవాలని అన్నది పవన్ ఆలోచనట.దీని కోసం సీఎం కుర్చీని సైతం త్యాగం చేసేందుకు పవన్ సిద్ధంగానే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పర్వాలేదు కానీ , జగన్ మాత్రం మళ్లీ అధికారంలోకి రాకూడదని , అలా వస్తే ఇక జనసేన పార్టీని మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది పవన్ భయానికి కారణమట.టిడిపి అధికారంలోకి వస్తే జనసేన ను విస్తరించేందుకు అవకాశం కలుగుతుంది అని పవన్ అభిప్రాయపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అందుకే ప్రస్తుతానికి పూర్తిగా సినిమాలు కొంతకాలం దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట.కరోనా వైరస్ ప్రభావం లేకపోయి ఉంటే వరుసగా షూటింగులతో పవన్ సినిమాలు పూర్తి చేసి ఉండేవారు.కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు బంద్ కావడంతో సినిమాలు పూర్తయ్యేసరికి మరి కొంత కాలం పడుతుంది.అప్పటివరకు రాజకీయంగా పవన్ అంతంతమాత్రంగానే యాక్టివ్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది.