జేసీ ఫ్యామిలీ రాజకీయ చరిత్రలోనూ ఎప్పుడూ లేనంత కష్టాలు ఎదుర్కొంటోంది.గత ఎన్నికల్లో ఎన్నో ఆశలతో జేసీ సోదరులు ఇద్దరూ రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులను పోటీ చేయించగా ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోయారు.
అనంతరం జేసీ సోదరులపై చాలా కేసులు నమోదు అవుతున్నాయి.జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
మరోవైపు జేసీ సోదరులు తాము రివేంజ్ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నామని సవాళ్లు రువ్వుతూనే ఉన్నారు.తాజాగా అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ అయిన జేసీ పవన్ కుమార్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు.
ప్రజలకు మంచి పాలన అందించాల్సింది పోయి ఈ కక్షసాధింపులు ఎందుకని ప్రశ్నించారు.ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలే తప్పా ఇలాంటి కక్ష సాధింపులతో కూడిన పాలన అనవసరం అని జేసీ పవన్ కుమార్ ఫైర్ అయ్యారు.
ఇక జగన్ తన ఫ్రెండ్ అని.తాను ఒక్క ఫోన్ చేస్తే ఏం ఉంటుందని కూడా చెప్పారు.అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిన అవసరం లేదని.తాము టీడీపీలో ఉంటామని జేసీ పవన్ కుమార్ తెలిపారు.
తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని.గతంలో వైసీపీ ముఖ్యనేతలను పార్టీలోకి రావాల్సిందిగా తమ వద్దకు పంపారని.అయితే తాము మాత్రం పార్టీలోకి వచ్చేది లేదన్న విషయాన్ని ఆనాడే చెప్పామని పవన్ తెలిపారు.అయితే నాడు వైసీపీ నేతలు పార్టీకి ఫండ్గా కొంత డబ్బు ఇవ్వమని కోరారని కూడా పవన్ చెప్పారు.
ఇక 2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జగన్ మంచి క్రేజ్లో ఉన్నా.తాము మాత్రం చంద్రబాబు విజన్ ఉన్న నేత అని భావించి టీడీపీలో చేరిన విషయాన్ని వెల్లడించారు.
2014 ఎన్నికల్లో కూడా తాము టీడీపీలోకి వెళ్లిన తర్వాత జిల్లాలో పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.ఏదేమైనా గతంలో జరిగిన విషయాన్ని చెప్పిన పవన్ కుమార్ రాజకీయ టార్గెట్లు వద్దని చెపుతున్నా వీరు అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డవారే ఇప్పుడు వీరిని టార్గెట్ చేస్తున్నారన్న విషయం మర్చిపోయినట్లున్నారు.