ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ ను టార్గెట్గా చేసుకుని ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.గత రెండు రోజులుగా వైకాపా నాయకులు చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
పెద్ద ఎత్తున ఈ విషయమై రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు అందుకు ధీటుగా స్పందిస్తున్నారు.మీరు చేసే అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇలా ప్రతిపక్షంపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన పని అంటూ టీడీపీ నాయకులు అన్నారు.
ఈ విషయమై నారా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిలో లేని అవినీతిని వెదకడం అనేది కొడి గుడ్డుపై ఈకలు పీకడం వంటిది అని, వైకాపా ఎంత ఈకలు పీకేందుకు ప్రయత్నించినా కూడా ప్రయోజనం శూర్యం అంటూ ఈ సందర్బంగా లోకేష్ అభిప్రాయ పడ్డాడు.తీవ్ర స్థాయిలో వైకాపా నేతలపై లోకేష్ మండి పడ్డాడు.
పరిపాలన పక్కకు పెట్టి ఆరోపణలు చేయడం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడమే వారి పని అయ్యిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.