వైకాపా గుడ్డుపై ఈకలు పీకేందుకు ప్రయత్నిస్తుంది

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్‌ ను టార్గెట్‌గా చేసుకుని ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.గత రెండు రోజులుగా వైకాపా నాయకులు చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

 Jagan Nara Lokesh Tdp Chandrababu-TeluguStop.com

పెద్ద ఎత్తున ఈ విషయమై రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు అందుకు ధీటుగా స్పందిస్తున్నారు.మీరు చేసే అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇలా ప్రతిపక్షంపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన పని అంటూ టీడీపీ నాయకులు అన్నారు.

ఈ విషయమై నారా లోకేష్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిలో లేని అవినీతిని వెదకడం అనేది కొడి గుడ్డుపై ఈకలు పీకడం వంటిది అని, వైకాపా ఎంత ఈకలు పీకేందుకు ప్రయత్నించినా కూడా ప్రయోజనం శూర్యం అంటూ ఈ సందర్బంగా లోకేష్‌ అభిప్రాయ పడ్డాడు.తీవ్ర స్థాయిలో వైకాపా నేతలపై లోకేష్‌ మండి పడ్డాడు.

పరిపాలన పక్కకు పెట్టి ఆరోపణలు చేయడం ప్రతిపక్ష పార్టీని టార్గెట్‌ చేయడమే వారి పని అయ్యిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube