ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్లో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు అవ్వాల్సి ఉన్న విషయం తెల్సిందే.అయితే సీఎంగా ఉన్న కారణంగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని లేదంటే నెలకు ఒకసారి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టులో విజ్ఞప్తి చేశాడు.
కాని సీబీఐ కోర్టు అందుకు ఆంగీకరించలేదు.దాంతో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాల్సిందిగా హైకోర్టును జగన్ ఆశ్రయించాడు.
జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు విషయంపై హైకోర్టు విచారణ జరిపింది.సీబీఐను ప్రతివాధిగా చేర్చుతూ ఎందుకు జగన్ ప్రతి వారం హాజరు అవ్వాలో తెలియజేయాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది.
రెండు వారాల్లో తదుపరి విచారణ జరుగనుంది.ఆ విచారణ సమయంకు సీబీఐ వారు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ వారు దాఖలు చేసిన కౌంటర్ను బట్టి, హైకోర్టులో వారి వాదనలు బట్టి జగన్ వ్యక్తిగత హాజరుకు సంబంధించిన తుది తీర్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.