ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు నయానో భయానో కేంద్రాన్ని తమ దారిలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నిరసనలని తెలియచేస్తూ కేంద్రం మెడలు వంచే ప్రయత్నం చేస్తుంటే మరో వైపు ఎక్కడ క్రెడిట్ మొత్తం చంద్రబాబు కి వెళ్ళిపోతుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నాడు జగన్ మోహన్ రెడ్డి.మేము మోడీ పై పోరాటం చేస్తున్నాము అని చెప్తూనే వైసీపి వాళ్ళు మరో వైపు మోడీ కాళ్ళు మొక్కుతారు.
ఇదేనా మీకు ఉన్న చిత్త శుద్ది అంటూ నిలదీస్తున్నారు టీడీపీ నాయకులు.ఇదిలాఉంటే
మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచీ ఈరోజు వరకూ కూడా మోడీ కి ఎదురుగా నిలబడి ధైర్యంగా దిక్కరించిన వాడు ఒక్కడు కూడా లేడు.అలాంటిది చంద్రబాబు నాయుడు మాత్రమే మోడీ ని ఎదిరించగాలిగారు.ఢిల్లీ వెళ్లి, ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు, డాక్యుమెంట్ లు చూపించి మరీ, వెళ్ళారు.
అసెంబ్లీ వేదికగా మోడీని దులిపి దులిపి పెట్టారు.మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని, మోడీ పైనే యుద్ధం చేస్తున్నారు.
ఈ క్రమంలో, తన పుట్టిన రోజు నాడే, దీక్షకు కూర్చుంటున్నారు.దేశ చరిత్రలలో ఏ ఒక్క సీఎం కూడా ఇప్పటి వరకూ తమ రాష్ట్రం కోసం దీక్షకి దిగిన సందర్భం లేదు…
అయితే చంద్రబాబు తలపెట్టిన ఈ దీక్షకి ప్రజల నుంచీ సానిభూతి ఎంతో ఉంది.
అయితే ప్రజల నుంచీ చంద్రబాబు దీక్షకి వస్తున్న మద్దతు జగన్ మోహ రెడ్డి కి మింగుడు పడటం లేదు.దాంతో ఎలాగైనా సరే చంద్రబాబు దీక్ష రోజున ఏదో ఒక అలజడి సృష్టిస్తే.
దీక్షలు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుదని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది…అందులో భాగంగానే కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో ఇవాళ భేటీ అయ్యారు.
ఆగిరిపల్లి మండలంలో జగన్తో పార్టీ ఎంపీలు మీటింగ్ ఏర్పాటు చేశారు.
సీఎం దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.చంద్రబాబు దీక్షకి కూర్చున్న రోజున రాజీనామాలు చేయిస్తే చంద్రబాబు కి మైలేజ్ రాకుండా ఉంటుంది.
అదే సమయంలో వైసీపి కి మైలేజ్ పెరుగుతుంది అని జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.అధికారం కోసం ప్రజల ముందు జగన్ హీరో అవ్వడం కోసం ఎన్ని నాక్క జిత్తులు వేయడానికి అయినా సరే సిద్దంగా ఉంటాడు అంటూ తిట్టిపోస్తున్నారు టిడిపి నేతలు.