ఏపీలో జగన్ రాజకీయాలు అందరికీ తెలిసిందే.ఎన్నికలకు ముందు ఆయన ఏ రేంజ్లో రాజకీయాలు చేశారో.
ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించారో తెలిసిందే.అమ్మ ఒడి, రైతుభరోసా, విద్యా కానుక, వాహన మిత్ర, మహిళలకు రుణాలు, పింఛన్ల పెంపు ఇలా అనేక పథకాలను ప్రకటించారు.
అధికారంలోకి వస్తే జిల్లాల విభజన చేస్తానని, కొందరి పేర్లు పెడతానని కూడా ప్రకటించారు.మొత్తానికి అధికారంలోకి వచ్చారు.
అయితే, ఇప్పుడు అమెరికాలోనూ అచ్చు ఇలానే ట్రంప్ రూపంలో జగన్ కనిపిస్తున్నారని అక్కడి ఏపీకి చెందిన ప్రవాసులు చెబుతున్నారు.
న్యూయార్క్, డెకాయిట్, ఇల్లినాయిస్, నార్త్ అమెరికా వంటి చాలా రాష్ట్రాల్లో తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి.
వారు ఎప్పటికప్పుడు ఏపీ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తూనే ఉంటారు.ఇటీవల అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై వారు స్పందించారు.ఈ ఏడాది నవంబరులో జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా రిపబ్లికన్లు, డెమొక్రాట్లు హోరా హోరీ గా పోరాడుతున్నారు.అయితే, వీరిలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ దూకుడు ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
ట్రంప్ ప్రతి ఒక్కరినీ ఆకర్షించడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ఒక భాగమైతే.అమెరికన్లపై వరాలు కురిపించడం మరో భాగం.గత 2016 ఎన్నికల్లోనూ ఆయన అమెరికన్లపై వరాల జల్లు కురిపించారు.
మెక్సికో గోడ కడతానని, దేశంలో అమెరికన్లకే ఉద్యోగాలు దక్కేలా చూస్తానని, విదేశీ విద్యార్థులకు అడ్డుకట్ట వేసి.స్థానికతకు పెద్దపీట వేస్తానని చెప్పారు.
అయితే,ఆయా అంశాల్లో ఈ నాలుగేళ్లలో ఆయన సాధించిన పురోగతి ఏమీ లేదు.అయినప్పటికీ.మరోసారి ఈ హామీలనే తెరమీదికి తెచ్చి మరికొన్నింటిని జోడించారు.దీనిలో హెల్త్ ఇన్స్యూరెన్స్, ఫుడ్ స్టంట్స్ (అల్పాదాయ వర్గాలకు ఉచిత ఆహారం), నిరుద్యోగులకు స్టయిఫెండ్, పన్ను రాయితీలు ఇలా అమెరికన్లపై జగన్ తరహాలో వరాల జల్లులు కురిపిస్తున్నారట.
దీంతో అక్కడి తెలుగు వారు జగన్ను గుర్తు చేసుకుంటున్నారట.!
.