తెలుగు రాష్ట్రాల మద్య కృష్ణ జలాల వివాదం మరో సారి తారా స్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది.ఇటీవల ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు నుండి నీటిని తరలించేందుకు జీఓను తీసుకు వచ్చిన విషయం తెలిసందే.
దాంతో తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసేందుకు సిద్దం అయ్యింది.ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంను తప్పుబడుతూ సీఎం కేసీఆర్ సహా పలువురు తెలంగాణ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.కేసీఆర్ ఈ విషయంలో మానవతా దృక్పదంతో వ్యవహరించాలంటూ విజ్ఞప్తి చేశాడు.
జల వివాదం విషయమై జగన్ మాట్లాడుతూ… కృష్ణా జలాల్లో ఏపీకి రావాల్సిన వాటానే తాము వినియోగించుకుంటున్నాం.రాయలసీమ మరియు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రజలు తాగు నీటికి అవస్థలు పడవద్దనే ఉద్దేశ్యంతోనే తాము ఆ నీటిని వినియోగించుకునేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు.
మేము ఎక్కువ నీటిని వినియోగించుకునేందుకు చూసినా కూడా కృష్ణ ట్రెబ్యూనల్ ఒప్పుకోదని, ఆ విషయాన్ని గమనించాలంటూ సీఎం కేసీఆర్కు జగన్ తెలియజేశాడు.ఈ విషయంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించాలంటూ కోరాడు.