ఇంటా బయటా ఏపీ సీఎం జగన్ అనేక ఇబ్బందులు , విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఆర్థికంగానూ ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.
ప్రభుత్వ ఆదాయం అంతా, సంక్షేమ పథకాలకు ఖర్చు అయిపోతూ ఉండడంతో, ఎప్పటికప్పుడు కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక ఏపీలో నెలకొన్న పరిస్థితులపై అదేపనిగా బీజేపీతో పాటు , మిగతా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
అంతర్గతంగా ను ఎన్నో రకాల ఇబ్బందులను ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది.వీటన్నిటికీ ఏకైక పరిష్కారంగా ఢిల్లీ వెళ్లడం ఒకటే మార్గమని ఏపీ సీఎం జగన్ అభిప్రాయపడుతున్నారు.
గత కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు.ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు, కేంద్ర బిజెపి పెద్దలను కలుస్తూ వ్యూహాత్మకంగా రాజకీయం నడిపిస్తున్నారు.
ఇప్పటికి ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు.ఇప్పటికే ఏపీ, తెలంగాణ ల మధ్య నెలకొన్న నీటి వివాదాలు విషయాన్ని కేసీఆర్ కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించారు.ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావాలని ఆయన కోరారు.అలాగే తెలంగాణలో రోడ్ల మరమ్మతులకు గురవ్వడంతో వాటికి సంబంధించి నిధులు కేటాయించాలని కోరారు.
కేసీఆర్ విషయంలో కేంద్ర పెద్దలు సానుకూలంగానే స్పందించారు.ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ సైతం ఢిల్లీ టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు, మిగతా కేంద్ర మంత్రులను కలిసేందుకు జగన్ ప్లాన్ చేసుకున్నారు.ఈ మేరకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జగన్ ఢిల్లీకి వెళ్లి ఏపీ సమస్యలను ప్రస్తావించి, కీలక హామీని పొందే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అలాగే క్రెడిట్ లాక్ విధించడంతో ఏపీలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
దీనిపైన జగన్ చర్చించే అవకాశం ఉంది.
అలాగే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి ఏపీలో రోడ్ల దుస్థితి పై నివేదిక ఇవ్వడం తో పాటు, కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని కోరే విధంగా ప్లాన్ చేసుకున్నారు.కేంద్రం ఆదేశాల మేరకు కరోనా నిబంధనలను ఏపీలో అమలు చేస్తున్నా, ఏపీ బిజెపి నాయకులతో పాటు, మిగతా పార్టీలు పెద్ద ఎత్తున తమపై విమర్శలు చేస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించి, సానుకూలత పొందే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.జగన్ చేపట్టబోయే ఢిల్లీ టూర్ లో ఉపశమనం కలిగించే అంశాలు ఎంతవరకు ఉంటాయో చూడాలి.