ఏపీ లో టీడీపీ అధికారం పోయి వైసీపీ అధికారంలోకి రానున్న సంగతి తెలిసిందే.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైన విషయం విదితమే.
మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ పార్టీ కేవలం 23 సీట్ల ను మాత్రమే దక్కించుకుంది.ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 స్థానాల్లో గెలిచి విజయ దుందుభి మోగించింది.
ఈ క్రమంలో ఏపీ నూతన ముఖ్యమంత్రి గా జగన్ ఈ నెల 30 న అనగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని కోరుతూ ఇప్పటికే అటు తెలంగాణా వెళ్లి సి ఎం కేసీఆర్ ను, ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీ ని కూడా జగన్ ఆహ్వానించారు.అయితే ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరుతూ ఫోన్ చేసి తెలిపారు.ఈ గురువారం విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో ఈ కార్యక్రమం జరగనుంది.
అయితే ఎలాంటి ఆడంబరాలు లేకుండా జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఉండనున్నట్లు తెలుస్తుంది.