వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టుగా ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర సమస్యలు, ఇతర రాజకీయ అంశాలపై చర్చించిన జగన్ ఆ తరువాత బీజేపీ చీఫ్ అమిత్ షా అపాయింట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు.
అయితే అప్పుడు అమిత్ షా దర్శన భాగ్యం చేసుకునే అవకాశం జగన్ కు లభించకపోవడంతో వెనుదిరిగి వచ్చేసారు.అయితే ఆ తరువాత ఆయన అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్లి రెండు రోజులపాటు ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు ఆయనతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అనేక అంశాల గురించి వీరి మధ్య చర్చలు జరిగినట్టు ఆ సందర్భంగా జగన్ పనితీరుని, పారదర్శకతను అమిత్ షా మెచ్చుకున్నట్టు ఇప్పుడు వైసీపీ వర్గాలు హడావుడి చేస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుసుకునే జగన్ కి అమిత్ షా దర్శనం మాత్రం దొరకడమే చాలా కష్టమవుతోంది.
ముందుగా రద్దు అయిన అపాయింట్మెంట్ ఆ తరువాత దొరకడమే కాదు మంచి సానుకూల వాతావరణంలో వీరి భేటీ భేటీ జరిగినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఈ సందర్భంగా పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో అమిత్ షా జగన్ ధైర్యాన్ని, ముందు చూపుని మెచ్చుకున్నట్టు, ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తాము అన్ని విధాలా అండదండలు అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని అమిత్ షా జగన్ కు భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరిగుతోంది.
ఇక ఏపీ విషయంలో తాను ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ మంత్రులు అందరితోనూ మాట్లాడి తగిన సహకారం అందించే ఏర్పాటు చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.
అమిత్ షా నుంచి ఈ రేంజ్ లో సమాధానం ఊహించని జగన్ లో ఎక్కడలేని ఆనందం ఆ భేటీ తరువాత కనిపించిందని వైసీపీ కీలక నాయకులు కొంతమంది వెల్లడిస్తున్నారు.ఏపీ బీజేపీ నాయకులు ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై విమర్శలు పెద్ద ఎత్తున కురిపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా తో భేటీ ఈ విధంగా సక్సెస్ అవ్వడంపై జగన్ ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది.అయితే ఇదే నిజం అయితే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ నాయకులు ఈ విషయంలో వెనకడుగు వేసి జగన్ పై ప్రశంసలు కురిపిస్తారా లేక తమ పని తమదే అన్నట్టుగా వ్యవహరిస్తారా అందేది తేలాల్సి ఉంది.
ఒక వైపు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జగన్ అమిత్ షా భేటీ జరగడం, అది సూపర్ సక్సెస్ అయ్యిందని ఆ పార్టీ నేతలు ప్రకటించడం పై రాజకీయంగా సంచలనంగా మారింది.
.