ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 14200 పోస్టుల భర్తీకి జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉండకూడదన్న భావనతో ఈ భారీ రిక్రూట్మెంట్ కి జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి నవంబర్ 15 వరకు కార్యాచరణ చేసేలా ఆరోగ్య శాఖలో ఖాళీలు పోస్టుల భర్తీకి సీఎం జగన్ ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది.ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లు ఇకపై ప్రైవేట్ ప్రాక్టీస్ మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకునే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా చేపట్టనున్న 14 వేలకు పైగా పోస్టులను భర్తీలోఈ నిబంధనను ఖచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వ అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారు.ఈ పోస్టులకు సంబంధించి పూర్తి భర్తీ డిసెంబరు 21వ తేదీ నాటికికంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.
నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.కరోనా నివారణ నియంత్రణవ్యాక్సినేషన్ కి సంబంధించి చర్చ సమయంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.