ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా జగన్ ప్రభుత్వం విడుదల చేయాలని భావించిన ఏపీ జాబ్ క్యాలెండర్ వచ్చే నెల 30 వ తారీకు విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ఈ విషయంలో అన్ని ప్రక్రియలు పూర్తయిన గాని చివరి క్షణంలో ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ రాకపోవడంతో ఉగాదికి విడుదల జాబ్ క్యాలెండర్.
వాయిదా పడినట్లు తెలుస్తోంది.మే 30 నాటికి జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగస్తుల నియామక క్యాలెండర్ ప్రభుత్వం విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో ఏ నియామకం చేపట్టినా దాని ప్రభావం ఖజానా పై పడే పరిస్థితి ఉండటంతో జాప్యం జరిగినట్లు ప్రభుత్వ వర్గాలలో టాక్.గ్రామ వార్డు సచివాలయాల్లో 8402, పశుసంవర్ధక శాఖలో 6099, ఆరువేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అంతేకాకుండా రెవెన్యూ శాఖలో 670 ఖాళీలు, ఇంక మిగతా శాఖలు కొన్ని పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు ఉన్నట్లు సమాచారం.మరి వచ్చే నెల జాబ్స్ క్యాలెండర్ లో ఎన్ని నియామకాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తుందో చూడాలి.
.