కరోనా కారణంగా ప్రపంచంలో పరిస్థితులు మొత్తం మారిపోయిన సంగతి తెలిసిందే.కారణం రాకముందు ఒకలా ఉంటే కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి ప్రపంచం పూర్తిగా మారిపోయింది.
చాలావరకు ఇంటివద్ద నుండి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.ముఖ్యంగా ఐటీ లో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోందిశగా వర్క్ చేస్తూ వస్తున్నారు.
ఇటీవల ఐటీ శాఖ డిజిటల్ లైబ్రరీ పై సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో వర్క్ ఫ్రొం హోమ్ కాన్సెప్ట్ బలోపేతం చేసే దిశగా కీలక సూచనలు అధికారులకు ఇవ్వడం జరిగింది.
గ్రామాలకు మంచి సామర్థ్యం కలిగిన ఇంటర్నెట్ అందివ్వాలని తెలిపారు.
తొలి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీ లు గ్రామాలలో ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.డిజిటల్ లైబ్రరీలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లతో పాటు అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ బుక్స్ ఉండాలని సీఎం జగన్ తెలిపారు.
ప్రతి గ్రామపంచాయతీలో డిజిటల్ లైబ్రరీ ఉండాలని.గ్రామ సచివాలయ లకు, రైతు భరోసా కేంద్రాలకు నిరంతరం ఇంటర్నెట్ అందించాలని జగన్ తెలిపారు. ఆగస్టు 15 నుండి డిజిటల్ లైబ్రరీ ల పనులు స్టార్ట్ చేసి డిసెంబర్ మాసం కల్లా పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ తెలిపారు.