చత్తీస్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 24 మంది జవాన్లు మరణించడం తెలిసిందే.ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ ఈ ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో జరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని పేర్కొన్నారు.జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
అంతమాత్రమే కాకుండా రెండు కుటుంబాలకు 30 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, ప్రభుత్వపరంగా రాబోయే రోజుల్లో మరింతగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఆర్థిక సహాయాన్ని తక్షిణం బాధిత కుటుంబాలకు అందించి .వారికి బాసటగా నిలవాలని ప్రభుత్వ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.కాగా ఈ ఘటనలో 31 మంది జవాన్లు గాయపడటం జరిగింది.
ఈ క్రమంలో అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించడం జరిగింది.
.