వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రోజా ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తూ అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లోనూ ఇరుకునపెట్టేవారు.
అంతే కాకుండా జగన్ కు అత్యంత సన్నిహితురాలిగా ఆమె పార్టీలో ముద్ర వేయించుకున్నారు.ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు, నగరి ఎమ్మెల్యే గా రెండోసారి గెలిచిన రోజాకు మంత్రి పదవి గ్యారంటీ అని అంతా అనుకున్నారు.
కానీ ఆమెకు పదవి దక్కలేదు.అయినా రోజాకు అదే స్థాయిలో ఏపీ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ ను జగన్ ఇచ్చారు.
ఒకపక్క పొలిటిషన్ గా, నటిగా, జడ్జిగా, యాంకర్ గా తీరికలేని షెడ్యూల్ తో రోజా ఉంది.అయితే జబర్దస్త్ పోగ్రామ్ లో రోజా చిందించే నవ్వులు వైఎస్సార్ పార్టీ కి ప్రస్తుతం ఇబ్బందికరంగా మారిందట.
గతంలోనే ఆమెకు ఆమె జబర్దస్త్ ప్రోగ్రాం కి గుడ్ బాయ్ చెబుతారని ప్రచారం జరిగినా ఆమె మాత్రం కొనసాగుతున్నారు.అయితే జగన్ మాత్రం రోజా జబర్దస్త్ ప్రోగ్రాం చేయడంపై ఆగ్రహం గా ఉన్నది ఉన్నట్టు తెలుస్తోంది.ఎప్పటికప్పుడు తన పరిపాలన, మంత్రులు, పార్టీ నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నజగన్ ఆ నివేదికల్లో పనితీరు సక్రమంగా లేని మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు గురించి వారికి సూచనలు చేస్తూనే వార్నింగ్ కూడా ఇస్తున్నారట.ఇదే ఇంటిలిజెన్స్ నివేదిక కూడా రోజాకు వ్యతిరేకంగా రావడంతో జగన్ ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఒకవైపు జబర్దస్త్ షో మరోవైపు ఏపీ ఐ ఐ సి ఛైర్మెన్ గా రెండు పడవల మీద ప్రయాణం సరికాదని, ఏదో ఒక దానికి పరిమితం కావాలని సూచించినట్టు తెలుస్తోంది.
ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా సమర్థవంతమైన సేవలు అందించాలంటే, జబర్దస్త్ పులిస్టాప్ పెట్టాల్సిందేనంటూ జగన్ చెప్పారట.అయితే దీనిపై రోజా డిఫెన్స్ లో పడినట్టు తెలుస్తోంది.తనకు రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిన జబర్దస్త్, ఇతర ప్రోగ్రాములు వదులుకోలేక, అధినేత జగన్ చెప్పిన సూచనలు పక్కన పెట్టలేక రోజా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.
దీనిపై తొందరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు రోజా సన్నిధి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మరో వైపు తమ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నజనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినా నాగబాబుతో జబర్దస్త్ షో లో సన్నిహితంగా ఉండడంపై చాలా కాలం నుంచే వైసీపీ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
మరి ఈ విషయంలో రోజా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.