వారి నోటికి జగన్‌ తాళం వేశాడా?

ఏపీ సీఎం జగన్‌ తన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మరియు మంత్రులను మరియు కొందరు నాయకులను రహస్యంగా హెచ్చరించాడని, మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడటం ఇక మానుకోవాలంటూ హెచ్చరించాడట.గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఏం మాట్లాడినా నడిచింది.

 Jagan Give The Warning To Ycp Mlas-TeluguStop.com

కాని ఇప్పుడు అలా కాదు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ జగన్‌ సూచించినట్లుగా తెలుస్తోంది.రోజా, చెవిరెడ్డి, కొడాలి నానితో పాటు ఇంకా కొందరు ముఖ్య నాయకులు అప్పట్లో తెగ మాట్లాడేవారు.

తెలుగు దేశం పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ వారు తమ మాటలతో అవతలి వారిని నోరు మూయించే వారు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.గత మూడు నాలుగు నెలలుగా వీరు అసలు మీడియా ముందు కనిపించడమే చాలా అరుదు అయ్యింది.వైకాపా ముఖ్య నాయకులు ఎవరు కూడా గతంలో మాదిరిగా చాలా ఎగ్రసివ్‌గా మాట్లాడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

తెలుగు దేశం పార్టీ నాయకులను టార్గెట్‌ చేసేందుకు వైకాపా నాయకులు ఆసక్తిగా ఉన్నారు.కాని జగన్‌ మాత్రం వారి నోటికి తాళం వేసి ఆపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube