ఎమ్మెల్యేలకు సీరియస్‌ క్లాస్‌ పీకిన జగన్‌

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఒకవైపు ప్రభుత్వంకు సంబంధించిన బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు పార్టీకి నష్టం కలిగించే వారిపై చాలా సీరియస్‌గా ఉంటున్నారు.గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల వివాదాల గురించి, పార్టీ నాయకులు కొందరు వ్యవహరిస్తున్న తీరుపై జగన్‌ చాలా సీరియస్‌గా ఉన్నాడు.

 Jagan Give The Strict Warning To Ycp Mlas-TeluguStop.com

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు చేయించడంతో జగన్‌ ఎవరి విషయంలో ఉపేక్షించేది లేదు అంటూ సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చాడు.

సొంత పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్‌కు ఆదేశించిన జగన్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిశాయి.

పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమైనా ఉంటే వెంటనే పసిగట్టి వాటిని తగ్గించేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇటీవల ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరియు కాకాని గోవర్దన్‌ రెడ్డిల మద్య పోరు ముదురుతున్న సమయంలో వైకాపా ముఖ్య నాయకులను పురమాయించి వారి విభేదాలకు స్వస్థి పలికించాడు.

ఇద్దరు కూడా తమకు ఎలాంటి విభేదాలు లేవు అంటూ మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు.ఆ తర్వాత జగన్‌ను ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు కలిశారు.ఆ సమయంలో చాలా సీరియస్‌గా ఆఎమ్మెల్యేలకు జగన్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube