తనని జగన్ ఉప ముఖ్యమంత్రి చేయాలి... బొబ్బిలి వ్యక్తి డిమాండ్

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం చాలా మంది ఎమ్మెల్యేలు తమకి మంత్రి పదవులు వస్తాయని ఆశపడ్డారు.మొదటి నుంచి జగన్ తో ఉన్నవారంతా ఏదో ఒక మంత్రి పదవి రాబోతుందా అని ఆశగా ఎదురుచూశారు.

 Jagan Deputy Cm-TeluguStop.com

అయితే సామాజిక సమీకరణాలతో కోరుకున్నవారిలో చాలా మందికి జగన్ మంత్రి పదవులు ఇవ్వలేదు.అయితే నలుగు ఉప ముఖ్యమంత్రి పదవులని ఎమ్మెల్యేలకి ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు విజయనగరం జిల్లాలో బొబ్బిలికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తనని జగన్ ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

బీసపు శ్రీనివాసరావు అనే వ్యక్తి కుటుంబం రెండేళ్ళుగా ఇంటి నుంచి బయటకి పెద్దగా రాకుండా తమని తాము నిర్భంధించుకున్నారు.

భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో శ్రీనివాసరావు బయటకు రావడమే మానేసాడు.ఎప్పుడో వచ్చిన ఎవరికీ కనిపించకుండా తాను మాత్రమే వచ్చేవాడు.అయితే ఆ కుటుంబాన్ని చుట్టూ ఉన్న వారు చాలా కాలం పాటు పట్టించుకోలేదు.కాని కొంత మందికి అనుమానం వచ్చి భయంతో పోలీసులకి సమాచారం ఇచ్చారు.

పోలీసులు వారిని బయటకి తీసుకొచ్చె ప్రయత్నం చేస్తే తనకు జగన్మోహన్ రెడ్డి ఉప మఖ్యమంత్రి చేస్తేనే బయటకు వస్తానని అంటూ ఆసక్తికరంగా మాట్లాడుతున్నాడు.ముఖ్యమంత్రి జగన్ వచ్చి తనను కలవాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్రీనివాసరావు భార్య కూడా భర్త మాట కచ్చితంగా జరగాల్సిందే అని పట్టుబట్టింది.వారి పరిస్థితి చూసిన వారికి వారి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వలన అలా మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.

అయితే వారిని బయటకి తీసుకురావడానికి ఏం చేయాలో పోలీసులకి అంతుబట్టడం లేదు.దీంతో వైద్యుల సహకారంతో వారిని బయటకి తీసుకొచ్చి హాస్పిటల్ కి తరలించాలని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube