జ‌గ‌న్ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి.. లాభం కంటే న‌ష్ట‌మే...!

దాదాపు 30 ఏళ్ల‌పాటు తానే అధికారంలో ఉండాల‌ని క‌ల‌లు కంటున్న వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌.దానికి త‌గిన విధంగా వేయాల్సిన అడుగులు వేస్తున్నా.

 Jagan Creates His Own Problems,andhra Pradesh, Chief Minister Jagan Mohan Reddy,-TeluguStop.com

పార్టీ ప‌రంగా వేస్తున్న అడుగులు మాత్రం పెను కుంప‌ట్ల‌నే రాజేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.కావాల్సినంత మంది నాయ‌కులు ఆయ‌న పార్టీలోనే ఉన్నారు.

జ‌గ‌న్ సీఎం పీఠం ఎక్కాల‌ని క‌ల‌లు గ‌న్న నాయ‌కులు, క‌ష్టించి ప‌నిచేసిన నేత‌లు ఉన్నారు.వీరిని స‌క్ర‌మంగా సంతృప్తి ప‌రిస్తే.

ఆయ‌న‌కు తిరుగులేదు.ఇక‌, అదే స‌మ‌యంలో ఎంత మంది నాయ‌కులు ఉండి మాత్రం ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ లేక‌పోతే.

ప‌రిస్థితి ఏమ‌వుతుందో.గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్ పెను దెబ్బ‌నే చ‌విచూశారు.

అప్ప‌ట్లో అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు కూడా నాయ‌కుల‌తో ఏదో ఒరుగుతుంద‌ని అనుకున్నారు.ఎంత ఎక్కువ మంది నేత‌ల‌ను లాగేస్తే.అంత ఎక్కువ బ‌లం ఉంటుంద‌ని, మ‌ళ్లీ మ‌ళ్లీ త‌న‌నే ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని భావించారు.ఈ భావ‌న‌లు ఏమ‌య్యాయో.

ప్ర‌జ‌లు తేల్చేశారు.మ‌రి ఈ పాఠాలు కేవ‌లం టీడీపీకే.

కేవ‌లం చంద్ర‌బాబుకే ప‌రిమితం అవుతాయా? అంటే.కాదు.

అన్ని పార్టీల‌కూ కాక‌పోయినా.అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ఖ‌చ్చితంగా వ‌ర్తిస్తాయి.

మ‌రి ఆదిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

Telugu Andhra Pradesh, Chandra Babu, Governmnet, Ycp, Ysrcp-Telugu Political New

అందిన కాడికి టీడీపీ నేత‌ల‌ను లాగేసే ప‌నిలో ప‌డ్డారు.తాజాగా విశాఖ కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌ను కూడా లాగే ప‌ని చేప‌ట్టారు.కానీ, ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో అటు వైసీపీ నేత‌లు, ఇటు టీడీపీ నేత‌లు పెరుగుతుండ‌డంతోపార్టీకి మ‌రిన్ని త‌ల‌నొప్పులు ఎదుర‌వుతున్నాయి.

ఇప్ప‌టికే తెచ్చుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు.నిత్యం ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగుతున్నారు.జుట్టూ జ‌ట్టూ ప‌ట్టుకుంటున్నారు.

మేం పార్టీ కోసం ఎంతో చేశామ‌ని వీరు.

మీ నాయ‌కుడే మ‌మ్మ‌ల్ని చేర్చుకున్నార‌ని వారు.నిత్యం ర‌గ‌డ‌కు దిగుతున్నారు.

దీనివ‌ల్ల పార్టీ బ‌ల‌ప‌డ‌క‌పోగా ఎక్క‌డిక‌క్క‌డ చీలిపోతోంది.వ‌ర్గాలు, గ్రూపులు పెరుగుతున్నాయి.

ఫ‌లితంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే నేత‌లు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా క‌నిపించడం లేదు.మ‌రి  ఈ ప‌రిస్థితుల‌ను జ‌గ‌న్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube