ఏపీ రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి గూడెం నుండి నెల్లూరు బయలుదేరి వెళ్లనున్నాడు.ఆయన అక్కడ అమ్మ ఒడి రెండో దశ కార్యక్రమంలో పాల్గొననున్నాడు.
అందుకు అక్కడ మంత్రులు ఎంఎల్ఏ లు నాయకులు ప్రభుత్వా అధికారులు అన్నీ ఏర్పాట్లను సిద్దం చేశారు.నెల్లూరు లోని శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైధానం అందుకు వేధిక అవ్వుతుంది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కానీ జగన్ మాత్రం అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొనడంపై రాష్ట్ర ఎన్నికల కమిషినర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.ఇప్పుడు జరిగేవి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావున గ్రామాల్లోనే ఎన్నికల కోడ్ అమలు అవ్వుతుంది.
కానీ అమ్మ వొడి లబ్దిధారులు ఎక్కువగా గ్రామాల్లోనే ఉంటారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వా సంక్షేమ పథకాలను అమలు చేయడంపై వైసీపీ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల సమయంలో ప్రభుత్వా పథకాలను ప్రవేశపెట్టుకోవచ్చు కానీ రాజకీయ నాయకులు మాత్రం పాల్గొనకూడదు.ప్రభుత్వ అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనే నిబందన ఉంది.
మరి ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి