నిన్నటితో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్బం చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను వివరిస్తూ హీరో నాని వాయిస్తో ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది.
నాని వాయిస్ ఓవర్తో వచ్చిన ఆ వీడియోలో పలు విశేషాలను తెలియజేశారు.ఇక ఈ చిత్రంకు సీక్వెల్ అంటూ ఇటీవలే నిర్మాత అశ్వినీదత్ ప్రకటించాడు.
అది ఎప్పుడు ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రాలేదు.
వైజయంతి మూవీస్ వారు విడుదల చేసిన వీడియోలో సినిమాకు సంబంధించిన సీక్వెల్ను హింట్ ఇచ్చారు.
సినిమాలో చివరి సీన్లో దేవకన్య అయిన శ్రీదేవి తన ఉంగరంను సముద్రంలోకి విసిరేస్తుంది.అప్పుడు ఆ ఉంగరంను ఒక చేప మింగేస్తుంది.ఆ విజువల్స్ను నాని వాయిస్ ఓవర్ వీడియోలో చూపించి 30 యేళ్లు అవుతున్నా ఇంకా చేప మింగిన ఉంగరం ఏమైందో తెలియలేదు అంటూ నాని చెప్పాడు.
సీక్వెల్ చేస్తే ఆ చేప నుండి ఉంగరం లభించడంతో కథ మొదలు అవుతుందని హింట్ ఇచ్చారు.కథ మొత్తం కూడా ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ జెనరేషన్లో సాగుతుందని అంటున్నారు.ప్రస్తుతంకు ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు కాని తప్పకుండా రాబోయే అయిదు సంవత్సరాల్లో ఈ సినిమా సీక్వెల్ వస్తుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.