జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌ కథ హింట్‌ ఇచ్చేశారు

నిన్నటితో మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్బం చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను వివరిస్తూ హీరో నాని వాయిస్‌తో ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది.

 Chiranjeevi, Sridevi, Nani, Voice Over, Ashwini Dutt,vyjayanthi Movies, Visuals-TeluguStop.com

నాని వాయిస్‌ ఓవర్‌తో వచ్చిన ఆ వీడియోలో పలు విశేషాలను తెలియజేశారు.ఇక ఈ చిత్రంకు సీక్వెల్‌ అంటూ ఇటీవలే నిర్మాత అశ్వినీదత్‌ ప్రకటించాడు.

అది ఎప్పుడు ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

వైజయంతి మూవీస్‌ వారు విడుదల చేసిన వీడియోలో సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ను హింట్‌ ఇచ్చారు.

సినిమాలో చివరి సీన్‌లో దేవకన్య అయిన శ్రీదేవి తన ఉంగరంను సముద్రంలోకి విసిరేస్తుంది.అప్పుడు ఆ ఉంగరంను ఒక చేప మింగేస్తుంది.ఆ విజువల్స్‌ను నాని వాయిస్‌ ఓవర్‌ వీడియోలో చూపించి 30 యేళ్లు అవుతున్నా ఇంకా చేప మింగిన ఉంగరం ఏమైందో తెలియలేదు అంటూ నాని చెప్పాడు.

Telugu Ashwini Dutt, Chiranjeevi, Nani, Sridevi, Visuals, Vyjayanthi-

సీక్వెల్‌ చేస్తే ఆ చేప నుండి ఉంగరం లభించడంతో కథ మొదలు అవుతుందని హింట్‌ ఇచ్చారు.కథ మొత్తం కూడా ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ జెనరేషన్‌లో సాగుతుందని అంటున్నారు.ప్రస్తుతంకు ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు కాని తప్పకుండా రాబోయే అయిదు సంవత్సరాల్లో ఈ సినిమా సీక్వెల్‌ వస్తుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube