టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పలు బ్లాక్బస్టర్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన వైజయంతీ మూవీస్, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది.కొన్ని దశాబ్ధాలుగా చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యానర్ను నిర్మాత సి.
అశ్వినీదత్ ఏర్పాటు చేశాడు.ఇక ఈ బ్యానర్లో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రాలలో ఒకటిగా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రం ఆ రోజుల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజయంతీ పిక్చర్స్ ఓ ప్రత్యేక కానుకను ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అయ్యింది.ఈ సినిమాకు సంబంధించిన మూడు రహస్యాలను నేచురల్ స్టార్ నాని ప్రేక్షకులకు తెలపనున్నట్లు వైజయంతీ పిక్చర్స్ ప్రకటించింది.
ఈ మూడు రహస్యాలను మే 5, 7, 9వ తేదీల్లో వరుసగా తెలపనున్నట్లు ప్రకటించారు.మరి ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాకు సంబంధించిన ఆ మూడు రహస్యాలు ఏమిటనేవి తెలియాలంటే నాని వాటిని బట్టబయలు చేసే వరకు ఆగాల్సిందే అంటున్నారు.
ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఓ భారీ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతోంది.అటు నాని ప్రస్తుతం ‘వి’ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు.
వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.