మా సీఎంను చూస్తే ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్ మరియు బీజేపీలకు భయం పుడుతుందని, కేసీఆర్ మాట వింటేనే ఆ రెండు పార్టీలు వణికి పోతున్నాయంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వరెడ్డి అన్నారు.హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేసిన ఆయన మరోసారి తెలంగాణలో టీఆర్ఎస్ సత్తా చూపించబోతున్నట్లుగా ప్రకటించాడు.
హుజూర్ నగర్లో గెలుపు కోసం ఆ రెండు ఢిల్లీ పార్టీలు తమ సిద్దాంతాలను వదిలేశాయంటూ జగదీశ్వరెడ్డి ఎద్దేవ చేశాడు.
గెలవమని తెలిసినా కూడా బీజేపీ ఎగిరెగిరి పడుతుందని, పరోక్షంగా బీజేపీ మరో పార్టీకి సహకరిస్తుందని ఆయన ఆరోపించాడు.
కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేసి హుజూర్ నగర్కు చేసింది ఏమీ లేదని, తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్దిని ఆయన చేసిందిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించాడు.ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించి ఉత్తమ్కు ప్రజలు తగిన బుద్ది చెప్పబోతున్నారు.
హుజూర్ నగర్ వెనకబడి ఉండటంకు ప్రధాన కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ మంత్రి ఆరోపించాడు.