బాలీవుడ్ అందాల భామలు చేసే సినిమాలు తక్కువ అయినా సోషల్ మీడియా ఫాలోవర్స్ మాత్రం విపరీతంగా ఉంటారు.ఆ స్థాయిలో వారికి ఫాలోవర్స్ ఉండటానికి కారణం సోషల్ మీడియాలో వారు షేర్ చేసే ఫోటో షూట్ లు.
ఎప్పటికప్పుడు క్యాలెండర్ కోసం, మ్యాగజైన్ కోసం బాలీవుడ్ భామలు హాట్ ఫోటో షూట్ లు చేసుకుంటూ ఉంటారు.ఇలాంటి ఫోటో షూట్ లకి సంబందించిన కిల్లింగ్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం ద్వారా అభిమానులకి నయనానందం కలిగిస్తారు.
ఈ కారణంగా సోషల్ మీడియాలో ఈ భామలని ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.ఇప్పటికే కొంత మంది భామలు 50 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ని దాటిపోయారు.
ఇప్పుడు మరో అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నిఏకంగా 46 మిలియన్స్ కి పెంచుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాలో ఈ శ్రీలంక బ్యూటీ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తన ఇన్స్టాగ్రమ్లో షేర్ చేసిన టాప్ లెస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.అయితే ఆమె ఈ ఫొటోలు షేర్ చేయడానికి కారణం ఉంది.
తనని ఇన్స్టాగ్రమ్లో ఫాలో అయ్యే వారి సంఖ్య 46 మిలియన్లకు చేరడంతో ధన్యవాదాలు తెలుపుతూ తన ఫాలోవర్స్కి జాక్వెలిన్ ఇలా అందాల విందు ఇచ్చింది.జాక్వెలైన్ ఫెర్నాండేజ్ నుంచి ఈ ట్రీట్ ఊహించని అభిమానులు, నెటిజన్లు ఆమె ట్రీట్ కి ఫిదా అయిపోతున్నారు.
ఈ ఫోటోలు చూసిన తర్వాత బాలీవుడ్ భామలకు సోషల్ మీడియాలో అభిమానులని పెంచుకోవడం ఎలాగో తెలుసని, సౌత్ భామల కంటే వాళ్ళు ఈ విషయంలో చాలా అడ్వాన్స్ గా ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.