రాసి పెట్టుంటే ఎంత లేట్ అయినా అదృష్టం వరించి తీరుతుంది.అందుకు దుబాయ్లో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం.
పదేళ్లుగా ప్రతి ఏడాది లాటరీ టికెట్ కొంటున్న ఓ వ్యక్తి తనకి ఎప్పుడు లక్ కలిసి వస్తుందోనని ఎదురుచూస్తున్నాడు.అయితే అతనికి టైమ్ కలిసొచ్చి మంగళవారం అతనికి జాక్పాట్ తగిలింది.
యూఏఈలో స్థిరపడిన శ్రీజిత్ అనే భారతీయుడు షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.మంగళవారం దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డీఎస్ఎఫ్) 25వ ఎడిషన్ డ్రాలో ఇన్ఫినిటీ క్యూఎక్స్ 50 కారుతో పాటు 2,00,000 దిర్హామ్లు (54,448 డాలర్లు) నగదు బహుమతిని పొందాడు.
దీనిపై శ్రీజిత్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.నిర్వాహకులు తనకు లాటరీ తగిలిందనని చెప్పగానే.తన చెవులను తానే నమ్మలేకపోయానని, గత పదేళ్లుగా ప్రతి ఏడాది రాఫిల్ టికెట్ను కొంటూ వస్తున్నానని చెప్పాడు.లక్కీ డ్రాలో విజయం ద్వారా తన కలలు నెరవేరతాయన్నాడు.
తన ఇద్దరు బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు ఇది బంగారు బాటలు వేస్తుందని శ్రీజిత్ చెప్పారు.