ఈ మధ్యకాలంలో ప్రేమించడం, విడిపోవడం చాలామంది చేసే పనులలో చాలా కామన్ విషయంగా మారిపోయింది.అందులో మరీ ముఖ్యంగా ప్రముఖుల విషయంలో ఈ సంఘటన ఎక్కువగా కనబడుతోంది.
ముఖ్యంగా సినీ స్టార్స్ విషయంలో ఇలాంటి విషయాలు మనం తరచుగా వింటూనే ఉంటాం.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో జాకీష్రాఫ్ కూతురు విషయంలో కూడా బ్రేకప్ అయినట్లు ఆవిడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
జాకీష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ చాలామందికి పరిచయం ఉన్న వ్యక్తి.ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటం మాత్రమే కాకుండా ఆమెకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తూ ఉంటుంది.
ఇదివరకు తన బాయ్ ఫ్రెండ్ తో కలసి దిగిన ఫోటోలు ఆవిడ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉండగా, తాజాగా తాను తన బాయ్ ఫ్రెండ్ తో కలసి దిగిన ఫోటోలు, వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియా నుంచి తొలగించింది.దీంతో ఆవిడ ఫ్యాన్స్ కు అనుమానాలు ఎక్కువయ్యాయి.
దీంతో ఈ విషయం పైన నెటిజన్స్ కృష్ణ ష్రాఫ్ ను ప్రశ్నించడంతో చివరికి ఆమె అసలు విషయాన్ని బయట పెట్టింది.తను తన బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హైమ్స్ తో రిలేషన్ షిప్ ను బ్రేక్ అప్ చేసుకున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని మా ఇద్దరికి సంబంధించిన విషయాలు చర్చించుకోవడానికి, అలాగే ఫోటోలు, వీడియోలు షేర్ చేయవద్దని ఆమె కోరింది.అంతేకాకుండా అతనికి సంబంధించిన విషయాల్లో తనని ట్యాగ్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా ఆవిడ విన్నపం చేసింది.గత కొద్ది సంవత్సరాలుగా ఇద్దరు కలిసి ఉన్న వీరిద్దరి మధ్య తాజాగా విడిపోయే అంత వైరం ఏం జరిగిందని నెటిజన్స్ భావిస్తున్నారు.ఇకపోతే ఈ విషయంపై ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హైమ్స్ ఇంకా ఈ విషయం పై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.