రోజురోజుకీ దేశంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.మనుషుల మీదే అనుకుంటే… మరోవైపు పశువుల మీద కూడా ఇలాంటి అమానుషాలు ఈ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి.
మొన్నటికి మొన్న కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఏనుగు దారుణాన్ని మరవకముందే దేశంలో మరో కొన్ని సంఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
అస్సాం రాష్ట్రంలోని కాఛార్ జిల్లాలోని ఓ రిజర్వాయర్లో దాదాపు 13 కోతుల మృతదేహాలు బయటపడడంతో సంచలనం రేగింది.
రిజర్వాయర్ లోని నీటిని కలుషితం చేసేందుకు మూగజీవాలను అక్కడ పడేశారని అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి కర్ణాటక రాష్ట్రంలో మరో ఘటన జరిగింది.
చిక్కమగళూరు పట్టణం సమీపంలోని ఓ వ్యక్తి పొలంలోకి అడవి జంతువులు ప్రవేశించకుండా విషం పూసిన పనస పండ్లు పెట్టగా వాటిని తిని మూడు ఆవులు అక్కడికక్కడే మృత్యు వాడబడ్డాయి.చిక్కమగళూరు జిల్లా బాసర పల్లి గ్రామానికి చెందిన కొట్టె గౌడ, మధు అనే ఇద్దరి వ్యక్తుల మూడు ఆవులు విషపూరితమైన పనస పండ్లు తిని అక్కడికక్కడే మరణించారు.
ఇకపోతే అడవి జంతువులను రానివ్వకుండా ఆపడం కోసమే ఇలాంటి చర్యలు చేపట్టినట్లు అక్కడి వారు అనుమానిస్తున్నారు.దీంతో పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం పూర్తి విచారణ చేపడుతున్నారు.
ఏది ఏమైనా మూగజీవాలను ఇలా విషపు ఆహారం పెట్టి చంపడం ఎంతవరకు సమంజసము అది పెట్టిన వారికి మాత్రమే అర్థం చేసుకోవాలి.