టాలీవుడ్ లో ఇటీవలే జబర్దస్త్ కామెడీ షో లో పని చేస్తున్నటువంటి ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి ఇటీవలే వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతగా కలకలం సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే వీళ్ళిద్దరూ ఇలా దొరికి పోవడంతో వీరి సినీ జీవితం పై కూడా ఈ ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దొరబాబు చేస్తున్నటువంటి కొన్ని చిత్రాల్లో దొరబాబు కి నో ఎంట్రీ బోర్డు పెట్టారని పలువురు చర్చించుకుంటున్నారు.అయితే జబర్దస్త్ షోకి నిర్మాతగా వ్యవహరిస్తున్న మల్లెమాల ఎంటర్ టైన్మెంట్ సంస్థ క్రమశిక్షణ కి పెట్టింది పేరు.
అందువల్లనే దొరబాబు మరియు పరదేశిలను జబర్దస్త్ షో నుంచి తీసేసినట్టు కూడా పలు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో లో నటించే నటీనటులకు షో నిర్వాహకులు కొత్త షరతులు పెట్టినట్లు సమాచారం.
ఇందులో ముఖ్యంగా ఈ షోలో నటించినటువంటి కమెడియన్లు లేదా ఆర్టిస్టులు ఎవరైనా సరే మరి ఏ ఇతర షోలకి కానీ ఈవెంట్లకి కానీ జబర్దస్త్ షో నిర్వాహకుల అనుమతి లేకుండా హాజరు కాకూడదని షరతులు పెట్టినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.అంతేకాక ఒకవేళ తమ అనుమతులు లేకుండా షరతులను ఉల్లంగిస్తే క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకుంటామని కూడా గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లలో నటించే నటీనటుల్లో కొందరు సినిమాల్లో మరియు ఇతర చానల్లెలో ప్రసారం అయ్యేటువంటి కామెడీ షోలలో కూడా నటిస్తున్నారు.మరి వారి పరిస్థితి ఏంటో చూడాలి.
ప్రస్తుతం ఈ విషయాలు నెట్లో భాగా వైరల్ అవుతున్నాయి.అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఇప్పటికే టాలీవుడ్లో చాలా మంది ఇలా వ్యభిచారం కేసులో దొరికిపోయారని, సినీ పరిశ్రమకు ఇదేమీ కొత్త కాదని అంటున్నారు.అయితే ఈ విషయంపై ఇప్పటికీ దొరబాబు స్పందించకపోవడంతో తో సరైన స్పష్టత లేకుండా ఎవరికి నచ్చినట్లు వారి కామెంట్లు చేస్తున్నారు.కాబట్టి ఇప్పటికైనా అయిందేదో అయింది దొరబాబు మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పి అసలు విషయం ఏంటో ప్రజలకు తెలిస్తే తమపై వస్తున్నటువంటి ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరి దొరబాబు స్పందిస్తాడో లేదో చూడాలి.