ప్రముఖ నటిగా, జబర్దస్త్ షో జడ్జిగా, ఎమ్మెల్యేగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోజాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతాఇంతా కాదు.సెప్టెంబర్ 10వ తేదీన వినాయకచవితి పండుగ సందర్భంగా ఈటీవీ ఛానల్ లో ఊరిలో వినాయకుడు పేరుతో ఒక ఈవెంట్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా విడుదలైన మరో ప్రోమోలో సుధీర్ వినాయకుడిని రష్మీ మనస్సు ఇచ్చేలా చూడమని కోరగా వినాయకుడు అందరూ ఈ పండుగ రోజు చేస్తున్న పూజలను చూపించాలని కోరుతున్నట్టు వాయిస్ వినిపిస్తుంది.
రష్మీ, సుధీర్ కలిసి రోహిణి ఇంటికి వెళ్లగా రోహిణి టీ తాగుతారా.? కాఫీ తాగుతారా.? అని అడగగా సుధీర్ కాఫీ అని చెబుతాడు.రోహిణి వెంటనే కింద టీ కొట్టు, కాఫీ కొట్టు ఉన్నాయని తాగి రావాలని చెబుతాడు.ఆ తర్వాత షోలోకి శ్రీకాంత్ ఎంట్రీ ఇవ్వగా శ్రీకాంత్ సుధీర్ పై పంచ్ లు వేస్తాడు.
రోజా, ఇంద్రజ వేర్వేరు టీమ్స్ కావడంతో మా టీమ్ లోకి రావాలంటే మా టీంలోకి రావాలని శ్రీకాంత్ ను లాగగా శ్రీకాంత్ రోజా టీమ్ లోకి వస్తారు.
రోజా కొడుకు, కూతురు ఈ షోలోకి గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చారు.
అయితే ప్రోమోలో నేను 1991లో ఇండస్ట్రీలోకి వచ్చానని 2002 వరకు కష్టపడిన డబ్బులు మొత్తం అప్పులు కట్టానంటూ రోజా ఎమోషనల్ అయ్యారు.ఆ సమయంలో ఇంద్రజ రోజా దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చారు.పెళ్లికి ముందే తనకు డాక్టర్లు పిల్లలు కారని చెప్పారని రోజా చెప్పుకొచ్చారు.అయితే పెళ్లి తర్వాత ఏడాదికే ప్రెగ్నెన్సీ రావడంతో పాటు అన్షు పుట్టిందని రోజా అన్నారు.
ఈ రీజన్ వల్లే కూతురు అన్షు అంటే తనకు చాలా చాలా ఇష్టమని రోజా వెల్లడించారు.ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న రోజా పడిన కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.రాకేష్ రాఘవ, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కొడుకు షోలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించారు.