కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్టార్ కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్.సుడిగాలి సుధీర్ కు సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉండటంతో పాటు సుధీర్ చేసిన టీవీ షోలు, ఈవెంట్లలో మెజారిటీ షోలు, ఈవెంట్లు సక్సెస్ అయ్యాయి.
స్కిట్లను హిట్ చేయడానికి తనపై పంచ్ లు వేసినా సుడిగాలి సుధీర్ స్పోర్టివ్ గా తీసుకుంటారు.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా ప్రోమోలో రోజా వేసిన పంచ్ లు హైలెట్ అయ్యాయి.
ఫిబ్రవరి 26వ తేదీన ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ కు అల్లరి నరేష్ గెస్ట్ గా హాజరయ్యారు.ప్రోమోలో సుధీర్, రామ్ ప్రసాద్ బ్యాగులతో ఎంట్రీ ఇవ్వగా రామ్ ప్రసాద్ మామయ్య గారు.! మీకు అమెరికా నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టి మొబైల్ తీసుకొచ్చానని చెబుతాడు.ఆ తరువాత పక్కనే ఉన్న పనివాడు సుధీర్ తో నన్ను కూడా మీతో పాటు లండన్ కు తీసుకెళ్లాలని అడగగా సుధీర్ లండన్ కు వెళ్లాలంటే ఛార్మినార్ దగ్గరకు వెళ్లి అక్కడ మూడో పిల్లర్ కింద ఉన్న సొరంగంలో పాతిక కిలోమీటర్లు వెళ్లాలని చెబుతాడు.
అక్కడ సత్తిగాడు అనే అతని దగ్గరికి వెళ్లి మనం పంపించామని చెబితే కారు వేసుకుని వెళ్లాలని చెబుతాడు.ఆ తరువాత పనివాడు సుడిగాలి సుధీర్ కు మీకు బాగా సొరంగంలో దూరడం అలవాటు అయిందని చెబుతాడు.ఆ తరువాత రామ్ ప్రసాద్ మీ సార్ ఫ్లెయిట్ లో వెళ్లడని ఎక్కడికి వెళ్లినా సొరంగంలోనే వెళతాడని చెప్పారు.ఆ తరువాత రోజా సుధీర్ పేరు సుడిగాలి సుధీర్ కాదని సొరంగాల సుధీర్ అంటూ అదిరిపోయే పంచ్ వేశారు.
రోజా వేసిన ఆ పంచ్ కు అందరూ పకపకా నవ్వారు.ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంద్గా 23 లక్షల వ్యూస్ వచ్చాయి.
బుల్లెట్ భాస్కర్ రాకేష్ మాస్టర్ ను దృష్టిలో పెట్టుకుని స్కిట్ లో వేసిన పంచ్ లు కూడా భలే పేలాయి.