బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి రోజా ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఎమ్మెల్యే హోదాలో ఉన్న రోజా కామెడీ షోకు జడ్జిగా ఉండటంపై ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి విమర్శలు వ్యక్తమైనా రోజా విమర్శలను లెక్క చేయకుండా బుల్లితెరపై సత్తా చాటుతున్నారు.
జబర్దస్త్ షోకు పోటీగా ఇతర ఛానెళ్లు ఎన్నో కామెడీ షోలను ప్రారంభించినా జబర్దస్త్ స్థాయిలో అవేవీ గుర్తింపు తెచ్చుకోలేకపోయాయి.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు మొదట నాగబాబు, రోజా జడ్జీలుగా వ్యవహరించగా కొన్ని కారణాల వల్ల నాగబాబు ఆ షోకు దూరమయ్యారు.
ప్రస్తుతం రోజాతో పాటు మనో ఈ షోకు జడ్జీలుగా ఉన్నారు.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో విడుదల కాగా సత్తిపండు ఆనంద్ లు కలిసి చేసిన స్కిట్ నవ్వులపువ్వులు పూయించింది.
స్కిట్ లో సత్తిపండు “ఏంటి భయ్యా.మళ్లీ నీ పెళ్లాం కొట్టిందా.?” అని అడుగుతాడు.
ఆనంద్ “జామకాయ అన్నాక చిలక కొడుతుంది.పొలం అన్నాక ఎలుక కొడుతుంది” అని చెప్పగానే రోజా అందుకుని “మొగుడు అన్నాక పెళ్లాం కొడుతుంది” అని పంచ్ వేస్తుంది.ఆనంద్ రోజాగారు సూపర్ చెప్పారు అని చెప్పగా రోజా “ఈ మాట మా ఆయన విన్నాడంటే నన్ను కొడతాడు” అని చెబుతుంది.
రోజా అలా చెప్పడంతో షోలో అందరూ నవ్వేశారు.రోజా అదిరిపోయే పంచ్ లు వేసిన ఎక్స్టా జబర్దస్త్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
జబర్దస్త్ షోలో భర్తను భార్య కొట్టడం, భార్యను భర్త కొట్టడం లాంటి స్కిట్లు ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉండటంతో ప్రేక్షకులు కూడా అలాంటి స్కిట్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోకు యూట్యూబ్ లో లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.