తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా నవ్వించే ప్రోగ్రాం ఏది అంటే అందరూ ఇచ్చే సమాధానం జబర్దస్త్ షో.ఈ షోలో ఎంతోమంది కంటెస్టెంట్స్ ఉన్న కానీ కేవలం హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి కొందరి స్కిట్ లు మాత్రమే చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు.
ఇలా అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న కమెడియన్ హైపర్ ఆది.పంచుల వర్షం తో కూడిన డైలాగ్స్ తో అందరిని కడుపుబ్బా నవ్వించగలడు హైపర్ ఆది.అప్పుడప్పుడు కాంట్రవర్షియల్ వైపు వెళ్లినా కూడా వాటిని ట్రెండింగ్ లో ఉన్న విషయాలపై మాత్రమే ఉండడంతో పెద్దగా ఆ వైపు నుండి ఇబ్బందులు ఎదురుకాలేదు.ఇకపోతే హైపర్ ఆది గురించి తెలుసుకోవాలంటే.
ఈయన ఓ సాధారణ కుటుంబం నుంచి బుల్లితెర ఇండస్ట్రీకి వచ్చిన వాడు.ఆ తర్వాత అడపదడప వెండితెరపై కూడా కనిపించాడు.ఈయన ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేశాడు.ఆ తర్వాత ఆయన రైటింగ్ సంబంధించిన వైపు వెళ్లి అక్కడ కొన్ని సంస్థలకు రైటర్ గా పని చేశారు.
ఆ తర్వాత మరో కమెడియన్ అభి పరిచయంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది.అలా కొన్ని రోజులు గడిచిన తరువాత హైపర్ ఆది స్వతహాగా ఓ టీం లీడర్ స్థాయికి ఎదిగాడు.అక్కడ తనదైన స్టైల్ లో పంచుల వర్షం కురిపిస్తూ ఓ స్పెషల్ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
ఈ మధ్య కాలంలో ఓ షోలో తాను జబర్దస్త్ కు రాకముందు తన కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని తాను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని అని చెప్పుకొచ్చాడు.
అప్పట్లో తాను, తన ఇద్దరు అన్నల చదువు కోసం తన తండ్రి ఆస్తులు అమ్మి చదివించారని చెప్పుకొచ్చాడు.మా చదువుల కోసం మా నాన్నకు ఉండే మూడు ఎకరాల పొలాన్ని కూడా అమ్మి తమని చదివించారని తెలిపారు.
అయితే తాను బీటెక్ పూర్తి చేసి అందులోని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి జబర్దస్త్ లోకి వెళ్లడం చాలా మందికి నచ్చలేదని తనను చాలా మంది తిట్టారని చెప్పుకొచ్చాడు.అలా పగలు రాత్రి తేడా లేకుండా స్క్రిప్టు రాసుకుని అభిమానులను సంపాదించుకుంటూ ముందుకు వెళ్లానని తెలిపాడు.
ఇకపోతే తను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ప్రస్తుతానికి ఎక్కడైతే తన తండ్రి మూడు ఎకరాలు అమ్మేసిన ఊరిలోనే పది ఎకరాల భూమి కొన్నానని అంతేకాకుండా వారి సొంత ఊరిలో ఓ పెద్ద ఇల్లు కూడా కట్టించినట్లు చెప్పుకొచ్చారు.ఏదేమైనా హైపర్ ఆది ఆస్తుల విలువ ప్రస్తుతానికి కోట్లలో ఉంటుందని బుల్లితెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.