గత రెండు సంవత్సరాలుగా నవ్విస్తున్న తమపై పదే పదే విమర్శలు చేయడం మరియు దాడులకు దిగడం అమానుషం అంటూ జబర్దస్త్ టీం ఆందోళన వ్యక్తం చేస్తోంది.తాజగా వేణుపై గౌడ కులస్తులు దాడికి దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జబర్దస్త్ టీం ఫిల్మ్ నగర్లో రాస్తా రోకో నిర్వహించింది.
ఫిల్మ్ చాంబర్ నుండి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.జబర్దస్త్ టీంతో పాటు పలువురు సినీ కళాకారులు మరియు, వారి అభిమానులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో నాగబాబు కూడా పాల్గొన్నాడు.ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ.
నవ్విస్తున్న వారిని కొట్టడం సరైన పద్దతి కాదని, అవమానపర్చేలా మాట్లాడితే, వారి మనోభావాలు దెబ్బతింటే అందుకు వేరే మార్గాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.ఏ విపత్తు వచ్చినా కూడా జబర్దస్త్ టీం ముందుండి సాయం చేసి, వారిని ఆదుకునేందుకు వస్తోంది.
తమపై దాడి అమానుషం అని కమెడియన్ ధన్రాజ్ అన్నాడు.దాడికి పాల్పడ్డవారిపై ఇప్పటికే పోలీసులు 341, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
కొందరిని అరెస్టు కూడా చేసినట్లు తెలుస్తోంది.